న్యూఢిల్లీ : కరోనా టీకా కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో బంగారం, రూ. 25 లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఢిల్లీలోని శివ విహార్కు చెందిన అరవింద్ కుమార్ పట్వా(40), ఆయన భార్య కలిసి కరోనా టీకా కోసం లక్ష్మీనగర్కు నిన్న ఉదయం 10 గంటలకు వెళ్లారు. తమ ముగ్గురు పిల్లలను అత్తగారింట్లో వదిలిపెట్టారు.
అయితే టీకా తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అరవింద్ తన ఇంటికి వచ్చి చూడగా.. గేటు, తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో షాక్కు గురైన అరవింద్ ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో ఉన్న బంగారం, రూ. 25 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు తేలింది.
దొంగతనంపై ఇరుగుపొరుగు వారిని అడగ్గా.. ఓ వ్యక్తి ఇంటి బయట కూర్చొని ఫోన్ మాట్లాడారని తెలిపారు. మొత్తానికి ఈ ఘటనపై బాధితుడు అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరవింద్ ఆటో నడపడమే కాకుండా, రాఖీ బిజినెస్ చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..