పుణె: మహారాష్ట్రలోని పుణెలో 42 ఏళ్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొవిడ్ పాజిటివ్గా తేలిన తనను వార్జె మాల్వాడీ ప్రాంతంలోని హాస్పిటల్ చేర్చుకోనందుకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. అయితే సదరు ఆసుపత్రి మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది. ఆమెకు కరోనా చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు చెప్పింది.
ఆమెకు ఏప్రిల్ 2న కొవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో 8వ తేదీన ఆమెను ఆ ఆసుపత్రిలో చేర్చాను. నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. అయితే అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మరుసటి రోజు అదే ఆసుపత్రికి తీసుకెళ్లాను. అయితే బెడ్స్ లేవంటూ ఆమెను చేర్చుకోలేదు అని ఆమె భర్త చెప్పాడు.
దీంతో తన భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడు తెలిపాడు. అయితే ఆ ఆసుపత్రిలో తన భార్యకు బెడ్ ఇవ్వలేదన్న విషయాన్ని అతడు తన ఫిర్యాదులో రాయలేదని పోలీసులు చెప్పారు. అటు హాస్పిటల్ కూడా ఆరోపణలను ఖండించింది. ఆమె పూర్తిగా కోలుకున్నదని చెప్పింది.
ఇవి కూడా చదవండి
రాహుల్కు గర్ల్ఫ్రెండ్ అతియా చెప్పిన విషెస్ చూశారా?
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి: నీతి ఆయోగ్ వీసీ
గాలి ద్వారానే కరోనా.. ఎన్95 లేదా కేఎన్95 మాస్కులే వాడండి
IPL 2021: సన్రైజర్స్కు మరో షాక్.. స్టార్ బౌలర్కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ