చెన్నై: ఐపీఎల్లో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు మరో షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ నటరాజన్కు మోకాలి గాయం అయింది. ఈ విషయాన్ని టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణే చెప్పాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు అతన్ని పక్కన పెట్టడంపై పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే. అతన్ని ఎందుకు టీమ్లో నుంచి తొలగించారని పలువురు అభిమానులు ట్విటర్లో ప్రశ్నించారు.
దీనిపై మ్యాచ్ తర్వాత లక్ష్మణ్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఆడటానికి అతడు ఫిట్గా లేడు. ఎడమ మోకాలి గాయమైంది. అందుకే అతని స్థానంలో ఖలీల్ అహ్మద్ను తీసుకున్నాము. నటరాజన్ పరిస్థితిని మెడికల్ టీమ్ సమీక్షిస్తోంది. అతనికి, ఫ్రాంచైజీకి ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంటాము అని లక్ష్మణ్ చెప్పాడు.
నటరాజన్కు విశ్రాంతి ఇచ్చాం తప్ప పక్కన పెట్టలేదని మ్యాచ్ సందర్భంగా టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ కూడా చెప్పాడు. ఇప్పటికే అతడు చాలా క్రికెట్ ఆడాడని, ఈ టోర్నీలో కూడా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున నటరాజన్కు విశ్రాంతి ఇచ్చినట్లు మూడీ తెలిపాడు.
ఇవి కూడా చదవండి
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
కుంభమేళాకు వెళ్లినవారికి క్వారంటైన్ తప్పనిసరి
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్కు కరోనా
కేరళ అందాలను చూసి తన్మయత్వం చెందిన అనసూయ