మాస్కో: రష్యాలో పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోయే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు హెచ్చరించారు. ఆయనకు గుండెపోటు రావచ్చని, వెంటనే చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నదని వాళ్లు స్పష్టం చేశారు. జైల్లో ఉన్న నావాల్నీ తన వెన్ను నొప్పి, మొద్దుబారినట్ల కనిపిస్తున్న తన కాళ్లు చేతులకు సరైన చికిత్స అందించాలంటూ మార్చి 31న నావాల్నీ నిరాహార దీక్షకు దిగారు. నావాల్నీని రష్యా ప్రభుత్వం హింసిస్తున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా శనివారం దీనిపై స్పందించారు. ఇది చాలా అన్యాయమని ఆయన అన్నారు. ఎప్పటివో నిధుల దుర్వినియోగం కేసులో నావాల్నీని గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలోని పొక్రోవ్ టౌన్లో ఉన్న జైల్లో ఆయనను బంధించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా నావాల్నీకి సరైన చికిత్స అందించడం లేదు. ఆయనకు చికిత్స చేసే అవకాశం కల్పించాలటూ నావాల్నీ వ్యక్తిగత డాక్టర్ వాసిల్యేవా, కార్డియాలజిస్ట్ యారోస్లావ్ అషిక్మిన్ జైలు అధికారులను కోరుతున్నారు.
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు అని అషిక్మిన్ శనివారం తన ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించారు. ఆయనను వెంటనే ఐసీయూలోకి తరలించాలని చెప్పారు. గతేడాది ఆయనపై విష ప్రయోగం కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు జైల్లో చేస్తున్న నిరాహార దీక్ష నావాల్నీ ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి చూస్తుంటే రోజుల్లోనే మరణించే ప్రమాదం ఉన్నదని అషిక్మిన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నావాల్నీ టీమ్ 5 లక్షల మందితో భారీ నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
కుంభమేళాకు వెళ్లినవారికి క్వారంటైన్ తప్పనిసరి
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్కు కరోనా
కేరళ అందాలను చూసి తన్మయత్వం చెందిన అనసూయ