బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఈ అమ్మడు ఇటు బుల్లితెర అటు వెండితెర ద్వారా ప్రేక్షకులకు పసందైన వినోదం అందిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఏదో ఒక స్టఫ్ తన ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ నెటిజన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన ఫ్యామిలీతో కలిసి కేరళ షికారుకు వెళ్లింది.
కేరళ అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం చెందుతున్న వీడియోని అనసూయ తన ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేసింది . ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కరోనా టైంలోను అనసూయ డేర్ చేసి బాగానే వెళ్లిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. యాంకరింగ్కు మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అలరిస్తున్న అనసూయ ఏప్రిల్ 30న థ్యాంక్ యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.