నారాయణపేట, ఏప్రిల్ 26: ప్రజలు సివిల్ ఫిర్యాదులను కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ చేతన తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఫిర్యాదుల పెట్టెలో సోమవారం 4 ఫిర్యాదులు వచ్చా యి. వాటిని పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించాలని ఎస్సైలు, సీఐలను ఆదేశించారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న కారణంగా ప్రజలు తమ ఫిర్యాదులను గ్రామాల్లో, పోలీస్ స్టేషన్ల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెల్లో వేయాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: చేతులెత్తేసిన బ్యాట్స్మెన్… పంజాబ్ ఢమాల్
ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం