జడ్చర్ల/జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జడ్చ ర్ల మీదుగా వెళ్తున్న కేసీఆర్కు నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జడ్చర్ల మండలంలోకి రాగానే గొల్లపల్లి వద్ద 44వ జాతీయరహదారి పక్కనున్న బ్లూఫాక్స్ మిన ర్వ హోటల్కు గులాబీ బాస్ చేరుకున్నారు. హోటల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ల క్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, పేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి అరగంటకుపైగా ఎన్నికలపై చర్చించారు. ఈ సం దర్భంగా కేసీఆర్ మిరపకాయ బజ్జి, ఆనియ న్ పకోడి తిని టీ తాగారు. ఉద్యమనేత మి నర్వ హోటల్కు వచ్చిన విషయం తెలుసుకు న్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అక్కడి కి రాగా వారికి అభివాదం చేస్తూ కేసీఆర్ బ యటికొచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ను తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోల రూపం లో బంధించారు. అనంతరం బస్సుయాత్ర భారీ కాన్వాయ్తో జడ్చర్లకు చేరుకోగా ఫ్లై ఓవర్ వద్ద పార్టీశ్రేణులు కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు.
మహబూబ్నగర్కు వెళ్తున్న బీఆర్ఎస్ అ ధినేతకు గులాబీశ్రేణులు ఘన స్వాగతం పలికారు. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్దకు రాగానే వందలాది బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్కు స్వా గతం పలికారు. మహిళలు హారతులివ్వగా.. నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా బస్సుపై పూలవర్షం కురిపిస్తూ సీఎం.. సీఎం అంటూ నినదించారు. కళాకారులు డ ప్పులు వాయిస్తూ బస్సుయాత్ర లో పాలుపంచుకోగా కేసీఆర్ తోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేశారు. అ నంతరం కేసీఆర్ బస్సు వెంటే జడ్చర్ల గులాబీ దళం వాహనాల్లో పాలమూరుకు తరలింది. రోడ్షో సక్సెస్తో శ్రేణు ల్లో మరింత జోష్ను పెంచింది.