చెన్నూర్, ఏప్రిల్ 26 : చెన్నూర్ ప్రాంత అడవుల్లోనూ ఏనుగులు సంచరించే అవకాశ ముందని, అందరూ అప్రమ త్తంగా ఉండాలని చెన్నూర్ అటవీశాఖ రేం జ్ అధికారి శివకుమార్ అన్నారు. శుక్ర వారం చెన్నూర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాల యంలో ‘మానవ-ఏనుగు-సంఘర్షణ’ అనే కార్య క్రమంలో భాగంగా ఏనుగులు సంచరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఆయన మాట్లాడుతూ ఏనుగులు వస్తే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తమకు వెంటనే సమాచారమివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్శాఖ, పశు వైద్యశాఖ, రెవెన్యూశాఖ సిబ్బంది పాల్గొన్నారు.