హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. 2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). అప్పట్లో ఉద్యమ ఊపిరిగా మారిన కేసీఆర్.. రాష్ట్రంలో యువతను పెద్దవారిని అందర్నీ ఏక తాటిపై నడిపించారని మహేష్ పేర్కొన్నారు.
ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. కాగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే ఉద్యమ పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీగా దూసుకెళ్తోంది. మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
కేటీఆర్ పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 టీఆర్ఎస్ ఎన్నారై శాఖలతో ఈ శనివారం 01 మే 2021 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు జూమ్ ద్వారా టీఆర్ఎస్ ఎన్నారైల ప్లీనరీని నిర్వహిస్తున్నారని మహేష్ బిగాల తెలిపారు .
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటుకున్న అంబులెన్స్ డ్రైవర్
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం