యాలాల, ఏప్రిల్ 26: మతతత్వ బీజేపీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాం గ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలసి తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మతం పేరుతో, గుడి పేరుతో ఓట్లు అడగడానికి మన ముం దుకు వస్తున్న వారికి బుద్ధి చెప్పే బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.