కామారెడ్డి, ఏప్రిల్ 26 : కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్.శ్రీదేవి బదిలీ అయ్యారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీకి సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్గా వెళ్తున్న సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించానని, తనవంతు బాధ్యతను పూర్తి చేశానని అన్నారు. ఉద్యోగులు, న్యాయవాదుల సహకారం మరిచిపోలేమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జిలు సుధాకర్, దీక్ష, పర్యవేక్షణ అధికారి శ్రీదేవి, న్యాయ శాఖ ఉద్యోగులు వెంకట్ రెడ్డి, సాయికృష్ణ, రమేశ్, రజిని, సంధ్య, సయ్యద్ రషీద్ అలీ, నాగేంద్ర, శ్రీధర్, చంద్రసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.