తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అ పూర్వ స్పందన లభించింది. జిల్లాలోని వి విధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎ త్తున తరలిరావడంతో మహబూబ్నగర్ పట్టణం జనసంద్రంగా మారింది. ఎటుచూసినా గులాబీజెండాలు కనిపించాయి. కేసీఆర్ను చూడగానే ఆనందంతో కేరింతలు కొడుతూ, చేతులూపుతూ, సెల్ఫీలు, వీడియోలు తీస్తూ జననేతను గుండెలకత్తుకున్నారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 7.30 గంటలకు కే సీఆర్ బస్సులో మహబూబ్నగర్ చేరుకోగానే దారి పొడవునా పూలుచల్లుతూ ఘ నంగా స్వాగతం పలికారు. పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీ నుంచి ప్రారంభమై న రోడ్ షోలో కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ నూతనోత్తేజాన్ని నింపారు.
కేసీఆర్ సారు దేవుడసోంటోడు. ప్రజలను, రైతులను పచ్చగా కాపాడుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వపాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆగమైంది. సాగు, నీళ్లు లేక మా పంటలు ఎండిపోతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ మాయమాటలను నమ్మి ప్రజలు ఓటేసినందుకు బాధపడుతున్నారు. నీళ్లు, కరెంట్ సరిగా ఇస్తలేరు. రైతుబంధు, రుణమాఫీ చేస్తారో లేదో తెల్వదు. కేసీఆర్ పాలన బాగుండె.
నేను డిగ్రీ చదివాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడంతో ఓ టేశాను. అధికారంలోకి వచ్చాక మాట త ప్పింది. దీంతో కాంగ్రెస్పై న మ్మకం పోయింది. మళ్లీ కేసీఆర్ సార్ వస్తేనే బా గుటుందని అనుకుంటున్న. ఈసారి బీ ఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది.