Chennai | తమిళనాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన చెన్నై (Chennai)లో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక కిల్పాక్ (Kilpauk) ప్రాంతంలోని రద్దీ రహదారిపై పలని (Palani) అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ కారు అదుపుతప్పి పలనిపైకి దూసుకెళ్లింది. ముందుగా అతడిని ఢీ కొట్టింది. అనంతరం అలాగే ముందుకెళ్తూ ఆటోను ఢీ కొట్టడంతో పలని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. కారు డ్రైవర్ను జయకుమార్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.
One person died after being hit by a speeding car in #Chennai busy road#TamilNadu #RoadSafety #Roadaccident #accident #viral #viralvideo #india pic.twitter.com/3MrlcuOWhg
— Siraj Noorani (@sirajnoorani) September 28, 2023
Also Read..
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్
Manipur Violence | మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. రంగంలోకి రాకేష్ బల్వాల్