సీరియల్ నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదేండ్లుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని, త్రినయని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని పేర్కొన్నారు. పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రాలేదని తెలిపారు. వివాహేతర సంబంధాలు మూలంగా జీవితాలు నాశనం అవుతున్నాయని, తమ జీవితం కూడా అలాగే అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పవిత్ర ఆకస్మిక మరణంతో చందు మానసిక ఒత్తిడికి గురయ్యాడని, ఇటీవల కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాని తెలిపారు. పవిత్ర.. నీ దగ్గరకు వస్తున్నా.. అని ఇన్స్టాలో మెస్సెజ్లు కూడా పెట్టాడని పేర్కొన్నారు. శుక్రవారం చందుకు ఫోన్ చేయగా, ఎత్తకపోయేసరికి అనుమానం వచ్చి తెలిసిన వారిని ఫ్లాటుకు పంపించగా, చందు ఫ్యానుకు ఉరేకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని శిల్ప వేడుకున్నారు.