ఎల్లారెడ్డి, మే 18: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్కు చెందిన కుడుముల సత్యం, కాంగ్రెస్లో చేరిన 25 రోజులకే పదవిని కోల్పోవడం గమనార్హం. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా.. 11 మంది ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ గత నెల 24న కలెక్టర్కు తీర్మానపత్రం అందజేశారు.
దీంతో శనివారం ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి 11 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 14 తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆర్డీవో స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై అవిశ్వాసం నెగ్గడం స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్కు ఊహించని పరిణామమని ఆ పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం.