నెక్కొండ, జూలై 8: పత్తి సాగులో కాండానికి మం దును పూతపూసే పద్ధతిని పాటించాలని నెక్కొండ వ్య వసాయాధికారి అడిదెల సంపత్రెడ్డి రైతులకు సూ చించారు. పెద్దకొర్పోలు రైతువేదికలో గురువారం పత్తి పంట సాగుపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం కాండానికి పూతపూసే విధానంపై రైతు లకు వివరించారు. పత్తిలో తొలిదశలో పచ్చదోమ, పేనుబంక, వేరుశనగ, తామరపురుగుల, తెల్లదోమ, పిండినల్లి వంటి రసం పీల్చే పురుగుల నివారణకు విచ్చలవిడిగా రసాయన పురుగుమందులను పిచికారీ చేయవద్దన్నారు. పత్తిలో 30,45 రోజుల్లో మోనోక్రో టోఫాస్, నీరు 1ః4 నిష్పత్తిలో, 60 రోజుల వయస్సు లో ఇమిడాక్లోపిడ్, లేదా ఫ్లోనికామిడ్, నీరు 1ః20 నిష్పత్తిలో కాండం లేత భాగాన బ్రష్తో రుద్దాలన్నారు. ఈ విధానాన్ని పాటించడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కార్యక్ర మంలో సర్పంచ్ మహబూబ్పాషా, ఏఈవో రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
డ్రమ్సీడర్ సాగు లాభదాయకం: ఏవో
ఖానాపురం: డ్రమ్సీడర్ సాగు రైతులకు ఎంతో లాభదాయకమని ఏవో శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రం శివారులో రైతు తక్కళ్లప ల్లి రమేశ్ వ్యవసాయ క్షేత్రంలో డ్రమ్సీడర్ సాగు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మా ట్లాడుతూ డ్రమ్సీడర్, వెదజల్లే విధానంలో కూలీల కొ రతను నివారించవచ్చన్నారు. అదేవిధంగా తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఏఈవో సంధ్య, రైతులు పాల్గొన్నారు.