జనగామ చౌరస్తా, ఏప్రిల్ 25 : జిల్లాలోని పల్లె దవాఖానల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరె న్స్ హాల్లో పల్లె దవాఖానల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 77 గ్రామీణ వై ద్యశాలల(పల్లె దవాఖాన)ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో 8దవాఖానల నిర్మాణం పూర్తి కావడంతో ఇం జినీరింగ్ అధికారులు వైద్యారోగ్యశాఖకు భవనాలను అప్పగించాలని ఆదేశించారు. అలాగే, 15వ ఫైనాన్స్ కింద మంజూరైన ఆరు సబ్ సెంటర్ల నిర్మాణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. మరో తొమ్మిది పీహెచ్సీలకు మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ హరీశ్రాజ్, పీఆర్ ఈఈ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ సుధీర్, డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా జిల్లాలోని పాలకుర్తిలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులకు దేవరుప్పుల మండలంలోని గొల్లపల్లి చెక్ డ్యామ్ నుంచి ఇసుకను సేకరించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో నీటి పారుదల, మైన్స్, భూగర్భ జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరాల శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకను తరలించే టిప్పర్లకు ముందు భాగంలో బ్యానర్లు కట్టించి, జీపీఎస్ ఏర్పాటు చేసి లైసెన్స్ కాపీ అందజేయాలని ఆదేశించారు. ఇసుక రవాణా వివరాలను పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి అనిల్కుమార్, జనగామ డివిజన్ నీటిపారుదల అధికారి ప్రవీణ్, ఏడీ మైన్స్ విజయ్కుమార్, ఏడీ గ్రౌండ్ వాటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఏరియాలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐదు పో లింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవరాయి కొమురయ్య పాల్గొన్నారు.