Former Suicide | జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామవాసి ఉచ్చేంతల శ్రీను (47) అనే రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. 30 ఏండ్లుగా ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. శ్రీను తన పొలంలో ఇప్పటివరకు నాలుగు బోర్లు వేయించినా, నీళ్లు లేక అవి ఫెయిల్ అయ్యాయి.
దీనికి తోడు ఇటీవల కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి నిర్మాణంతోపాటు వ్యవసాయం చేయడానికి డబ్బులేక అప్పులు చేశాడు. అతడు వేసిన వరిపొలంలో సరైన దిగుబడి రాలేదు. దీంతో తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురయ్యాడు. దీంతో శుక్రవారం తన వ్యవసాయ భావి వద్ద సర్కార్ తుమ్మచెట్టుకు తాడుతో ఉరేసుకుని చనిపోయాడు. దీనిపై తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.