Election Commission | మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కల్వకుంట్ల తారకరామారావుపై ఈ నెల ఒకటిన వరంగల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలపై హెచ్చరించింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం వార్నింగ్ చేసింది. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్పై మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు మంత్రికి ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఆరోపణలు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్, మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.