హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రేషన్కార్డు లబ్ధిదారులకు మూడు రంగుల్లో ఉన్న లామినేటెడ్ కార్డును ప్రభుత్వం అందించనున్నది. ఈ నెల 15న సంగారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త రేషన్కార్డులను పంపిణీ చేయనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలుగా ఆయిల్పామ్, వెదురుసాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 జిల్లాల్లో మొత్తం 2,355 ఎకరాల విస్తీర్ణంలో వె దురు సాగుకు అనుమతులు మంజూరు చేసింది. రైతులకు ఉద్యానశాఖ 50 శాతం రాయితీపై మొకలు అందిస్తుంది.