నారాయణపేటరూరల్, ఆగస్టు 6 : పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెంది న విషాదకర ఘట న ఎక్లాస్పూర్ లో గురువారం చో టుచేసుకుంది. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పిచ్చికుంట్ల సంగీ త గుండప్పల రెం డో కుమా రుడు రంజిత్(8) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన రంజిత్ తరగతి గదిలో ఉండగా పాము కాటు వేసింది. ఒకసారిగా జరిగిన ఈ ఘటనతో పాఠశాలలో తీవ్ర భయాందోళన నె లకొంది. పాముకా టు కు గురైన రంజిత్ను వెంటనే జిల్లా దవాఖా న తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడం తో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు గ్రామంలో విషాదఛాయలు..
విద్యార్థి రంజిత్ మృతి చెందిన విషయం తెలియడంతో ఎక్లాస్పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకు న్నాయి. పాఠశాలలో చదువుకోవాల్సిన బాలుడు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్లే పాములు పాఠశాలలోకి వచ్చినట్లు అధికారులు ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని ప్రభుత్వ పాఠశాలల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేదు : మాజీ ఎమ్మెల్యే చిట్టెం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేకపోవడం వల్లే ఎక్లాస్పూర్లో విద్యార్థి రంజిత్ పాముకాటుకు గురై మృతి చెందాడని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నారాయణపేటలోని దవాఖానలోని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం దవాఖాన ఎదుట జరిగిన ఆందో ళనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి పాముకాటుతో మృతి చెంది ఏడుగంటలు కావస్తు న్నా ఏ ఒక్క జిల్లా అధికారి స్పందించకపోవ డం శోఛనీయం అన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.