– తీర్థల, దంసలాపురం జలాశయంలో నిమజ్జన వేడుకలు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 15 : ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలలో కలిపి మొత్తం సుమారుగా 205 గణేష్ మండపాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సంబంధిత అధికారులు 185 మండపాలకు సంబంధించి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరో 20 మండపాలు ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరం మండలంలో మొత్తం 180 గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు, ఆశించిన మేర మున్నేరు వాగులో నీటి నిల్వలు లేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఖమ్మం రూరల్ మండలం తీర్థల వద్ద మున్నేరు వాగులో ఒక ఘాటు, ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురం జలాశయంలో మరో ఘాట్ను ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ఆరంభమయ్యాయి. ఊరువాడ అని తేడా లేకుండా గల్లి గల్లి లో గణేష్ వేడుకలు జరుగుతున్నాయి. నవరాత్రి వేడుకల నుండి మొదలు నిమజ్జన ప్రక్రియ ముగిసిన వరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు అధికారులకు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు పోలీస్ అధికారులు నిర్వాహకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

ఖమ్మం రూరల్లో 205 గణేష్ మండపాలు