లఖింపూర్ ఖేరీ: (Ashish Misra) రైతులపైకి కారు పోనిచ్చిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు కోర్టులో చుక్కెదురైంది. ఆశిష్ మిశ్రాతోపాటు మరొక నిందితుడికి కోర్టు బెయిల్ నిరాకరించింది.
లఖింపూర్ ఖేరీ హింస కేసులో అరెస్టయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, మరొకరికి బుధవారం మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆశిష్ మిశ్రా, అతడి అనుచరుడు ఆశిష్ పాండే బెయిల్ దరఖాస్తులను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ చింతా రామ్ తిరస్కరించారు. 12 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అక్టోబర్ 9 న యూపీ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆశిష్ మిశ్రాను అరెస్టు చేసింది. ఆశీష్ మిశ్రా, మరో నిందితుడు శేఖర్ భారతితో పాటు మంగళవారం నుంచి మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. ఇదిలా ఉండగా, ఆశిష్ మిశ్రా, అతడి సహచరుడు అంకిత్ దాస్ ను ఇవాళ యూపీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ గంట పాటు ప్రశ్నించింది. మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన అంకిత్ దాస్ అక్టోబర్ 8 న నేపాల్ పారిపోయినట్లు అంగీకరించాడు.
అయితే, లఖింపూర్ ఖేరీ సంఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఫార్చ్యూనర్లో ఉన్నాడని చెప్పడాన్ని అంకిత్ దాస్ ఖండించారు. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు జరగలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అంకిత్ దాస్ అక్టోబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అతడికి అక్టోబర్ 17 వరకు మూడు రోజుల పోలీసు కస్టడీ కూడా విధించారు. తాను అమాయకుడినని, ఈ ఘటనలో తన పాత్ర లేదని అంకిత్ దాస్ చెప్పాడు. తాను విమానంలో ఉన్నానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉన్నదని తెలిపాడు.
హైదరాబాద్ వేదికగా ఆయిల్ పామ్ సమ్మిట్
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రశాంత్కుమార్ మిశ్రా ప్రమాణం
మూడేండ్లుగా తెలంగాణలో అధిక వర్షాలు
జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ల్యాబ్ పనులకు శంకుస్థాపన
ఇమ్రాన్ఖాన్-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?
పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్ అధ్యయనం
సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!
లఖింపూర్ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు
బేబీ షవర్ ఫంక్షన్ జరుపుకున్న ఫ్రీదా పింటో
ట్రంప్కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..