అమృత్సర్ : (Honeytrap) భారతదేశంకు చెందిన ఒక ఆర్మీ జవాన్ హనీట్రాప్లో చిక్కుకున్నాడు. పాకిస్తాన్కు చెందిన ఒక మహిళకు అధికారిక రహస్య పత్రాలు పంపుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన ఆర్మీ జవాన్ ఫిరోజ్పూర్ కంటోన్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్నట్లుగా సమాచారం.
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐకి చెందిన ఓ మహిళా అధికారి భారత ఆర్మీ జవాన్ను హనీట్రాప్లోకి దించింది. తద్వారా ఆయన నుంచి అధికారిక రహస్య సమాచారాన్ని తీసుకుంటున్నది. ఫిరోజ్పూర్ కంటోన్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ జవాన్ను పాకిస్తాన్ మహిళా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (పీఐఓ) సిద్రా ఖాన్ 2020 లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కలిసింది. ఇద్దరూ స్నేహితులై చాటింగ్ చేసుకున్నారు. ఆమె కోరినట్లుగా భారత్కు చెందిన మిలిటరీ పత్రాలను పంపుతున్నాడు. ఈ జవాన్ తీరుపై అనుమానం వచ్చిన పంజాబ్ పోలీసుల ‘స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్’ (ఎస్ఎస్ఓసీ) ఈయన దినచర్యపై కన్నేసింది. పాకిస్తాన్ అధికారికి రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లు రూఢీ చేసుకున్న అనంతరం శనివారం జవాన్ను అరెస్టు చేసింది.
అరెస్టయిన జవాన్ పేరు కృనాల్ కుమార్ బరియా. గుజరాత్ లోని పంచమహల్ జిల్లాలోని దమనోద్ గ్రామ నివాసి. గత ఏడాదిన్నర కాలంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన సిద్రా ఖాన్కు రహస్య సమాచారాన్ని అందిస్తున్నాడు. ఎస్ఎస్ఓసీ వర్గాల ప్రకారం, ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సామాజిక సైట్ల ద్వారా పాకిస్తాన్ గూఢచార సంస్థల ఏజెంట్లతో కృనాల్ నిత్యం టచ్లో ఉండేవాడు. రహస్య సమాచారానికి బదులుగా అతడికి భారీగా డబ్బు ముట్టజెప్పుతున్నట్లు గుర్తించారు. ఎస్ఎస్ఓసీ బృందం కృనాల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ
చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..