గువాహటి : (CDS Bipin Rawat) చైనాతో ఎల్ఏసీ సహా ఇతర సమస్యలు చర్చల ద్వారా పరిష్కరామవుతాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. రెండు దేశాల మధ్య సందేహాస్పద పరిస్థితి నెలకొన్నదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. చైనాతో సరిహద్దు సమస్యను సమగ్రంగా చూడాలని, ఈశాన్య లేదా లడఖ్ సమస్యను ఒంటరిగా చూడవద్దన్నారు. బిపిన్ రావత్ గువాహటిలో రవికాంత్ సింగ్ తొలి స్మారక ఉపన్యాసం చేశారు. మయన్మార్, బంగ్లాదేశ్లోని రోహింగ్యా శరణార్థుల పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని, రోహింగ్యా శరణార్థులు తీవ్రమైన అంశాల వల్ల దుర్వినియోగమయ్యే ప్రమాదమున్నదని తెలిపారు.
కాబూల్లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా.. జమ్ముకశ్మీర్తో పాటు ఈశాన్య ప్రాంతానికి ముప్పు పొంచిఉన్నదని బిపిన్ రావత్ హెచ్చరించారు. అయితే అంతర్గత పర్యవేక్షణలో పని చేయడం ద్వారా ఈ ముప్పును అధిగమించవచ్చని ఆయన చెప్పారు. ఇప్పుడు సైనిక స్థాయి, విదేశీ వ్యవహారాల స్థాయి, రాజకీయ స్థాయిలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతున్నాయని బిపిన్ రావత్ చెప్పారు. సరిహద్దు సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం నాకున్నదన్నారు. గతంలోనూ సరిహద్దు వివాదాలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకున్నట్లు తెలిపారు.
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ
చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..