(Crying Room) మన బాధలను ఎవరితోనైనా పంచుకుంటే ఉపశమనం కలుగుతుందని పెద్ద వాళ్లు చెప్తుంటారు. ఎవరైనా ఏడుస్తూ చెప్తుంటే కూడా వాళ్లను ఏడవనివ్వండి.. వాళ్ల బాధను ఏడుపు ద్వారా వెళ్లగక్కుతున్నారు.. అని చెప్తుండటం కూడా మనం వినే ఉంటాం. లోలోపల బాధపడటం, పక్కవాడికి వినిపించనంతగా ఏడ్వడం వల్ల నష్టమే తప్ప లాభం లేదంటున్నారు అధ్యయనకారులు. బిగ్గరగా ఏడవడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. వీరి సూచనల మేరకు స్పెయిన్లో ‘క్రైయింగ్ రూం’ సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ఈ ‘క్రైయింగ్ రూం’ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను అధిగమించడానికి స్పెయిన్లో ‘క్రైయింగ్ రూమ్’ ప్రాజెక్ట్ ప్రారంభించారు. మానసికంగా కలవరపాటుకు గురైన వారు ఎవరైనా మాడ్రిడ్లోని ఈ గదిలోకి వచ్చి బహిరంగంగా ఏడవవచ్చు. అలాగే గట్టిగా అరవవచ్చు కూడా. దీంతో పాటు ఎలాంటి సంకోచం లేకుండా సహాయం కూడా అడగొచ్చు. ఈ గదిలో మానసిక వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతారు. స్పెయిన్లో ‘క్రైయింగ్ రూం’ లను ప్రారంభించడానికి ఆత్మహత్యలు ఎక్కువగా జరుగడమే ప్రధాన కారణం. 2019 లో స్పెయిన్లో 3,671 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 10 మంది టీనేజర్లలో ఒకరు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక్కడి జనాభాలో 5.8 శాతం మంది ఆందోళనతో బాధపడుతున్నట్లు తేలింది.
సెంట్రల్ మాడ్రిడ్లోని ఒక భవనంలో ఈ ‘క్రైయింగ్ రూం’ లోకి ఎవరైనా రావచ్చు. మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను దాని నుండి బయటకు తీసుకురావడమే ఈ రూం ప్రధాన ఉద్దేశం. పింక్ కలర్లో ఉండే ఈ గదిలోకి వచ్చే వారికి అవసరమైన సహాయం చేసేందుకు సర్వం సిద్ధంగా ఉంటుంది. గదిలో ఒక మూలలో మీరు స్వేచ్ఛగా మాట్లాడగలిగే వ్యక్తుల పేర్లుంటాయి. వారితో మాట్లాడి మీ బాధను వారితో పంచుకోవచ్చు. మానసిక ఆరోగ్యంపై సలహాలు కూడా పొందవచ్చు. దీని కోసం ఫోన్ నంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. గోడపై అతికించిన పోస్టర్లపై ‘మీ గురించి నేను కూడా ఆందోళన చెందుతున్నాను’ అని రాసి ఉంటుంది.
మావోయిస్టు పార్టీ మాదిరిగా టీడీపీ : మంత్రి బొత్స కామెంట్లు
కశ్మీర్లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్పై దాడులు ప్రారంభించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..