Dense Fog | గత కొన్ని రోజులుగా ఉత్తరభారతదేశం (Nort India) చలికి గజగజ వణికిపోతోంది. చల్లటి వాతావరణానికి తోడు పలు రాష్ట్రాలను దట్టమైన పొగ మంచు కమ్మేస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ప్రజలు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. దట్టమైన పొగ కారణం విజిబిలిటీ సైతం కొన్ని ఏరియాల్లో జీరోకు పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దేశరాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఢిల్లీలోని సఫ్ధార్జంగ్ అప్జర్వేటరీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.8 డిగ్రీల సెల్సియస్, లోధి రోడ్డులో 5.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. రాజస్థాన్లోని సికార్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 0.5 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. చురులో 1.0 డిగ్రీల సెల్సియస్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జనవరి 15వ తేదీ వరకూ ఉత్తరాది రాష్ట్రాలపై చలి తీవ్రత కొనసాగుతుందని తెలిపింది.
Delhi’s Safdarjung and Lodhi Road recorded 5.8 and 5.6 degrees Celsius minimum temperatures respectively.
Rajasthan’s Sikar reported the lowest minimum temperature of -0.5 degrees Celcius and Churu recorded the second lowest of 1.0 degrees Celcius. pic.twitter.com/C21aiR4nfQ
— ANI (@ANI) January 11, 2024
జీరోకు పడిపోయిన విజిబిలిటీ
చలికి తోడు ఆయా రాష్ట్రాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. గురువారం ఉదయం 5:30 గంటల సమయానికి ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విజిబిలిటీ 100 మీటర్లుగా ఉంది. ఇక భోపాల్, రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో దృశ్యమానత 200 మీటర్లుగా ఉంది. పంజాబ్లోని బటిండా, ఆగ్రాలో దృశ్యమానత జీరో మీటర్లకు పడిపోయింది. త్రిపురలోని అగర్తలాలో 25 మీటర్లు, జమ్మూ, ఉత్తరప్రదేశ్లోని వారణాసి, మధ్యప్రదేశ్లోని సత్నా, బీహార్లోని పూర్నియా, అస్సాంలోని తేజ్పూర్, హర్యానాలోని హిసార్లో విజిబిలిటీ 50 మీటర్లుగా నమోదైంది.
ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగ మంచు రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గడ్డకట్టిన దాల్ సరస్సు..
భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir) మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సు (Dal Lake)లో చలి తీవ్రతకు నీరు గడ్డకడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
#WATCH | Srinagar, J&K: A thin sheet of ice forms on the Dal Lake as the temperature falls below zero degrees Celsius. pic.twitter.com/scPn6jiI2k
— ANI (@ANI) January 11, 2024
#WATCH | Rajasthan: A thin sheet of ice forms at places in Mount Abu, as the temperature dips below freezing point. pic.twitter.com/we4p0TkM0C
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 11, 2024
Also Read..
YouTube India | అసభ్యకర వీడియోలు.. యూట్యూబ్ ఇండియాకు సమన్లు
Coronavirus | 24 గంటల్లో 514 కొత్త కేసులు.. మూడు మరణాలు
Amazon Layoffs | అమెజాన్లో మళ్లీ లేఆఫ్స్ కలకలం.. వందలమందిపై వేటు..!