నిజామాబాద్: జిల్లాలోని ఇంద్రాపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. మృతుడిని కిష్టయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మార్చి 30న మొరం టిప్పర్ ఢీకొని పంచాయతీ కార్యదర్శి మృతిచెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..