మక్తల్ రూరల్: రాష్ట్రంలో మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని భూత్పూర్ గ్రామంలో భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 7 లక్షల 80వేల చేప పిల్లలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్య పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించారన్నారు.
చేపలు పట్టే కార్మికులకు సబ్సిడీపై రుణాలు, వలలు, సామాగ్రిని అందిచడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడైన చెరువులల్లో, రిజర్వాయర్లలో చేపలు పెంచడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందన్నారు. గతంలో కార్మికులు సొంతంగా డబ్బులు వెక్షించి చేప పిల్లల సీడ్స్ కొనుక్కోవాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో మత్స్య సంపద పెంచడానికి అనుకూలమై వనరులు ఉన్నాయన్నారు.
గత మూడు సంవత్సరాలలో మక్తల్ మండంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ బ్యాలె న్సింగ్ రిజర్వాయర్లలో ప్రభుత్వం ద్వారా 10లక్షల చేపల పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది సకా లంలో వర్షాలు రావడం వల్ల రెండు రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండడంతో 20 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడా నికి చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
మత్య్స సంపద వల్ల మత్స్యకార్మికులకు మంచి లాభాలు ఉన్నాయన్నారు. మధ్య దళారులను ఆశ్రయించకుండా కార్మి కులు సొంతంగా చేపల మార్కెటింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. మత్స్య కార్మికులకు తగిన సహాయ సహాకా రాలను అందిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, డైరెక్టర్ సాలమ్బిన్ ఉమర్, మున్సిపల్ కొఆఫ్సన్మెంబర్ శంషుద్దీన్, భూత్పూర్ సర్పంచ్ హన్మంతు, మత్య్ససంఘం అధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.