గోపాల్పేట, మే 9 : హామీలను విస్మరించిన సర్కారును బొంద పెట్టి, కేసీఆర్కు అండగా నిలవాలని.. వ్యవసాయానికి కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చి రైతును రాజును చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని పద్మావతి గార్డెన్స్లో ఉమ్మడి మండల బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి నిరంజన్రెడ్డి హాజరై మాట్లాడారు. ఏదు ల రిజర్వాయర్ నియోజకవర్గానికే తలమానికమని, ల క్షా 25వేల ఎకరాలకు శాశ్వత సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అడగకముందే ప్ర జల అవసరాలు తీర్చిన నేత కేసీఆర్ అని కొనియాడా రు. సాగుతో రైతులకు, ఉపాధి పరిశ్రమల ద్వారా 16లక్షల మందికి ఉద్యోగాలు, ఐటీ ద్వారా 6.30లక్షల మం దికి మొత్తంగా.. 40లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అ వకాశాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
ఆరు గ్యారెంటీలతో ప్రజల బతుకులను కాంగ్రెస్ సర్కా రు ఆగం చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలు, రైతుబంధు రూ.15వేలు, రుణమాఫీ రూ. 2లక్షలు, ఆసరా పింఛన్లు రూ.4వేలు, ప్రతి మహిళకు రూ. 2,500, ఉ చిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, కల్యాణలక్ష్మీతో పాటు తు లం బంగారం, యువతులకు స్కూటీలు, యువకులకు ఉద్యోగావకాశాలు, నిరుద్యోగ భృతి.. ఇలా ఎన్నో మోస పు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
కేసీఆర్ మార్గదర్శకత్వంలో వెయ్యి గురుకులాలను స్థాపించి 10లక్షల మంది విద్యార్థులను శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు క ల్పించిన మేధావి ఆర్ఎస్పీ అని కొనియాడారు. కారు గుర్తుకు ఓటేసి అత్యంత ప్రతిభావంతుడైన ఆర్ఎస్ ప్ర వీణ్కుమార్ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కో రారు.
మల్లు రవి పైరవీలకు ప్రాధాన్యమిచ్చి తమ ఆస్తు లు, అంతస్తులను సంపాదించుకున్నారే తప్పా ప్రజల ను పట్టించుకోలేదన్నారు. రాములు కన్న తల్లిలాంటి పార్టీకి మోసం చేసి.. ఓట్ల కోసం వస్తున్నాడని వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సమావేశానికి భారీగా తరలొచ్చిన మహిళలు స్పందిస్తూ.. హామీలు అమలు చేసే దాకా కాంగ్రెస్కు ఓటేయమని.. కేసీఆర్కే అండగా ఉం టామన్నారు. అనంతరం పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి మాజీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, పెద్దమందడి జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు మతీన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతియాదవ్, బీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు బాలరాజు, జెన్కో రిటైర్ట్ ఎస్ఈ తిరుపతిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.