బిజినేపల్లి, మే 9 : అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా మోసపోయి ఆగం కావొద్దని, ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్కుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అ న్నారు. గురువారం మండలంలోని ఎర్రగుంట తం డా, నక్కల చెరువుతండా, ఊడ్గులకుంట తండా, పెద్దతండా, బొడుసుగడ్డ తండా, వసురాంతండా, కారుకొండ తండా, వెల్గొండ, వట్టెంలో మర్రి ప్ర చారం నిర్వహించి మాట్లాడారు. ఆర్ఎస్పీ గెలిపిస్తే బిజినేపల్లి మండలంలో గిరిజన పాఠశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు తండాలను పట్టించుకోలేదని.. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఆరు గ్యారెంటీల అమలులో సర్కారు విఫలమైందన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో మనకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు పూర్తిచేసి లక్షా యాభైవేల ఎకరాలకు సాగునీ రు అందిస్తామన్నారు. ఎన్నికల్లో అందరూ కారు గుర్తుకు ఓటేసి ఆర్ఎస్పీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, పులేందర్రెడ్డి, భారతి, వంశీ, శంకర్, గోపి, భోజ్యా, లింబ్యానాయక్, తిరుపతిరెడ్డి, రాములు, నాగిరెడ్డి ఉన్నారు.