కొత్తకోట, మే 9 : ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రని మాజీ ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పాలెం, నిర్వేన్, కానాయపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డికి మ ద్దతుగా ప్రచారం చేశారు. అనంతరం కొత్తకోట ప ట్టణంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హమీలివ్వడంలో రేవంత్రెడ్డి ఘనుడని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ పత్రం ఇచ్చి.. బ స్సుల్లో ఫ్రీ ప్రయాణం పేరిట మహిళల మధ్య గొడవలు సృష్టించాడన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చే స్తే.. కాంగ్రెస్ అధికారం చేపట్టి సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. శంకరసముద్రం రిజర్వాయర్ నిర్వాసితులకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందు కు కేసీఆర్ ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆరునెలలు గడుస్తున్నా రూ.రెండులక్షల రుణమాఫీ ఎందుకు చేయడం లేదని, హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు. కా ర్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, ప్రశాం త్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, నరోత్తంరెడ్డి, శేఖర్గౌడ్, సత్యం, గట్టయ్య, రాములు, వెంకటేశ్వర్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.