న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.32కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 18-44 సంవత్సరాల మధ్య వయస్సున్న 6,63,353 మంది లబ్ధిదారులు శుక్రవారం మొదటి డోస్ తీసుకున్నారని పేర్కొంది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి 92,73,550 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. ఇప్పటి వరకు మొత్తం 19,32,97,222 మంది లబ్ధిదారులకు టీకాలు వేసినట్లు వివరించింది. 19.32 కోట్ల మోతాదుల్లో.. 97,37,237 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 66,89,893 మందికి రెండో డోసు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఫ్రంట్లైన్ కార్మికుల్లో 1,48,63,770 మందికి మొదటి డోసు, 83,05,152 మందికి రెండో డోసు వేసింది. 18-44 సంవత్సరాల వయస్సున్న వారికి 92,73,550 మందికి ఫస్ట్ మోతాదు అందజేసినట్లు పేర్కొంది. 45-60 ఏళ్ల మధ్య వారికి 6,01,86,416 మొదటి, 96,79,427 మందికి రెండో డోసు పంపిణీ చేసినట్లు తెలిపింది. 60 సంవత్సరాలు పైబడిన లబ్ధిదారులకు 5,63,74,895 ఫస్ట్ డోస్.. 1,81,86,882 మందికి సెకండ్ డోస్ వేసినట్లు చెప్పింది. శుక్రవారం వ్యాక్సినేషన్ డ్రైవ్ 126వ రోజుకు చేరగా.. ఒకే రోజు 13,83,358 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.