ఊర్కొండ: రైతు అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
ఆయన శనివారం మండల కేంద్రంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠ ధామం,డంపింగ్ యార్డ్లతో పాటు రైతువేదిక, బతుక మ్మ చీరల పంపిణీ కార్యక్రమంలోఆయన పాల్గోని వాటిని ప్రారంభించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని రైతుకు నేరుగా అందజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్ర మేనన్నారు.