PRC | పాపన్నపేట, జూలై 26 : రాష్ట్రప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులు భీమ్లా, జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, భూషణం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని, రిటైర్ అవుతున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని చెల్లింపులు చేయాలని, జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు శ్రవణ్, నాయుడు, రఫీక్, పవన్ పాల్గొన్నారు.
Gajwel | గజ్వేల్లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన