MLA Kotha Prabhakar Reddy | తొగుట, మార్చి 10 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తొగుట మండలంలోని వెంకటరావుపేటకు చెందిన ఈదుగల స్వామికి అండగా ఉంటామని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి భరోసా ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మూలంగా స్వామి తీవ్రంగా గాయపడగా.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి తీవ్రంగా గాయం కావడంతో పరిస్థితి విషమించడంతో కుడి చేతిని తొలగించారు.
స్వామి నిరుపేద కావడంతో వైద్య చికిత్స కోసం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన స్పందించి సీఎం సహాయనిధి ద్వారా రూ. 1,50,000/- మంజూరు చేయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు స్వామి భార్య చంద్రకళకు అందించారు. ఆర్థిక సాయాన్ని అందజేశారు. గాయం పెద్దగా ఉండటంతో ప్లాస్టిక్ సర్జరీ కావాల్సి ఉందని, తదుపరి సహాయం కోసం అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి స్వామి కుటుంబసభ్యులు ధన్యవాదములు తెలిపారు. నిరుపేద స్వామికి విషమ పరిస్థితి రావడంతో సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా పిలుపు ఇవ్వగానే పెద్ద మనసుతో సహాయం చేసిన ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్, ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య, వార్డు సభ్యులు పిట్ల వెంకటేష్, జహంగీర్, మిద్దె శ్రీనివాస్, ఎంగలి నరేందర్, నాయకులు డబ్బికారి పెంటోజీ, ఎర్రోళ్ల చంద్రం, వడ్డె నర్సింలు, సుతారి రాములు, ఈదుగాళ్ల పర్శరాములు, కొక్కొండ సురేష్, కత్తుల రమేష్, పాత్కుల బాలేష్, సత్తయ్య, బాలయ్య, ప్రశాంత్, శేఖర్, అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’