Revenue Conference | చేర్యాల, జూన్ 9 : రాష్ట్రవ్యాప్తంగా నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన చేర్యాల పట్టణంలోని రైతు వేదికలో రెవెన్యూ సదస్సును నిర్వహించనున్నారు.
చేర్యాల పట్టణంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ దిలీప్నాయక్ కోరారు. సోమవారం తహసీల్దార్ దిలీప్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ రైతులకు భూసంబంధమైన సమస్యలు ఉంటే సదస్సులో అర్జీలు సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..