Farmers | రాయపోల్, ఏప్రిల్ 16 : రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని దౌల్తాబాద్ మండల సర్పంచుల ఫోరమ్ తాజా మాజీ గౌరవ అధ్యక్షుడు దార సత్యనారాయణ సూచించారు. రైతులు దళారులను నమ్మి.. పంటను అమ్ముకుని మోసపోవద్దని ఆయన పేర్కొన్నారు. ఇవాళ మండల పరిధిలోని మల్లేశంపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని పేర్కొన్నారు. మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తుందన్నారు. రైతులు ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రైతులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తుందని అన్నారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధరను పొంది ఆర్థికంగా లాభం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, ఐకేపీ సీఏ అనిత, రైతులు కిషన్, బాబా తదితరులు పాల్గొన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్