Farmer Registry | తొగుట, ఫిబ్రవరి 22 : పట్టా పాస్బుక్ కలిగిన ప్రతీ రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకుడు మల్లయ్య తెలిపారు. ఆదివారం బండారుపల్లి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. రైతులు తమ ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్తో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే, రైతులకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ కోడ్) కేటాయించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని చెప్పారు.
భూమి కలిగిన ప్రతి రైతు, తన భూములకు సంబంధించిన అన్ని వివరాలతో ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని సూచించారు.పీఎం కిసాన్ లబ్ధిదారులు తదుపరి విడత నిధులు పొందడానికి కూడా ఈ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని మల్లయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోలా వెంకటస్వామి, ఏఈవో నాగార్జున, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Medak | మెదక్ జిల్లాలో దారుణం..భార్యను గొంతు కోసి హతమార్చి, నగలతో పరారైన భర్త
Modugapoolu | మోదుగు పువ్వులు విరబూస్తూ.. బాటసారులకు కనువిందు చేస్తూ
Rtc bus | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్కు గాయాలు