Farooq hussain| రాయపోల్, మార్చి 22 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో మైనారిటీలకు పెద్ద పీట వేయడం జరిగిందని రాయపోల్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకింది మంజూరు అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సిద్దిపేటలోని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నివాసంలో రంజాన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు చింతకింది మంజూరు ఫారూఖ్ హుస్సేన్ ను శాలువాతో ఘనంగా సన్మానించి.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుని రంజాన్ పర్వదినం శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సికిందర్,స్వామి,బుచ్చన్న,ఖాజా,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Shankar | ‘వేల్పారి’తో మరో విజువల్ వండర్ … 1000 కోట్ల ప్రాజెక్ట్పై కోలీవుడ్లో భారీ చర్చ
Bigg Boss 9 Telugu | 13వ వారం టికెట్ టూ ఫినాలే హీట్.. రీతూ, సంజనాల డ్రామాలు చూసి షాక్
Aryan Khan | మరోసారి చిక్కుల్లో ఆర్యన్ ఖాన్.. కేసు నమోదు