Rythu Bharosa | రాయపోల్, మార్చి 17 : యాసంగి 2025-26 రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా దరఖాస్తులు చేసుకోవాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్
మండల వ్యవసాయ అధికారి నరేష్ సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ.. 28.02.2026 తేదీ వరకు కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన డిజిటల్ సైన్ అయిన రైతులు, అలాగే ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
దరఖాస్తు చేసుకునే రైతులు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులను రైతు భరోసా దరఖాస్తు ఫారానికి జతపరచి తమ గ్రామ వ్యవసాయ విస్తరణాధికారికి సమర్పించాలని తెలిపారు. అలాగే బ్యాంక్ ఖాతా వివరాల్లో మార్పులు చేయాలనుకునే రైతులు వెంటనే తమ గ్రామ ఏఈఓను సంప్రదించి వివరాలు ఇవ్వాలని సూచించారు.
ఇప్పటికే రైతు భరోసా లబ్ధి పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం రైతులు తమ గ్రామ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు.
MP Shanmugam | ‘నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా’.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..?
Hema- Surekha | తోటలో ఎంజాయ్ చేసిన హేమ- సురేఖవాణి.. ఈతకల్లు తాగుతూ హల్చల్
Faisal Malik | బాలీవుడ్ ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా ‘పంచాయత్’ నటుడు!