Mahareddy Bhupal Reddy | రైతు ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిలిపివేయడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా శంకరంపేట (ఎ) మండలంలోని జుక్కల్, వీరోజీపల్లి గ్రామాలలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను మహారెడ్డి భూపాల్ రెడ్డి సందర్శించారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రోజులు గడుస్తున్నా వడ్లు కొనుగోలు కాకపోవడం, తూకాలు ఆలస్యం కావడం, సరిపడా సిబ్బంది లేక రైతులు గంటల తరబడి వేచి ఉండటంతో తాము తీవ్ర ఆందోళనలో ఉన్నామని రైతులు మహారెడ్డి భూపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఫోన్ చేసి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మహారెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. రైతు నష్టపోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతులకు ఎప్పుడూ మేము అండగా ఉంటామని అన్నారు.
సంగారెడ్డి జిల్లా, శంకరంపేట (ఎ) మండలంలోని జుక్కల్, వీరోజీపల్లి గ్రామాలలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి.
కొనుగోలు కేంద్రాల్లో రోజులు గడుస్తున్నా వడ్లు కొనుగోలు కాకపోవడం, తూకాలు ఆలస్యం కావడం,… pic.twitter.com/olFEZm5Wh7
— BRS Party (@BRSparty) May 20, 2026
Chattogram | బంగ్లాదేశ్లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు