సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో మద్యం మత్తులో ఉన్న తండ్రి చేతిలో కొడుకు ప్రాణాలొదిలాడు. కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్ గౌడ్, సాయికుమార్ తండ్రీ కొడుకులు. మద్యం మత్తులో ఉన్న తండ్రీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సాయి కుమార్ (25)ను శ్రీనివాస్గౌడ్ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్తలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు శ్రీనివాస్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి