Congress Leader | జిన్నారం, జనవరి 03 : కాంగ్రెస్ పార్టీ తనకు బీ ఫామ్ ఇవ్వలేదని ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలు రోడ్డెక్కింది. తనకు కాంగ్రెస్ పార్టీ భీ ఫాం ఇవ్వకపోవడంతో ఆందోళన చేపట్టింది. ఈ ఘటన మున్సిపల్ కేంద్రమైన జిన్నారంలో చోటుచేసుకుంది.
జిన్నారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డుకు చెందిన కాంగ్రెస్ మహిళ నేత నీలం లత గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే కేటాయించిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితాలో నాలుగో వార్డ్ జనరల్ మహిళకు కేటాయించడంతో తనకు బీఫారం లభిస్తుందని నీలం లత ఆశించింది.
కానీ కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా నీలం లతకు కాకుండా పుట్టి విజయలక్ష్మికి బీఫామ్ కేటాయించింది. దీంతో నీలం లత ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిన్నారంలో నామినేషన్ దాఖలు చేస్తున్న కేంద్రం వద్ద ఆందోళనకు దిగింది.
ఈ సందర్భంగా నీలం లత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు చోటు దక్కకపోవడం సరైనది కాదన్నారు. జిన్నారంకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు వడ్డే కృష్ణ, శ్రీకాంత్ రెడ్డిలు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదన్నారు.
Jagthyal | జగిత్యాల మున్సిపల్ పోరులో జీవన్ రెడ్డి vs సంజయ్