Velichala Rajender Rao | కార్పొరేషన్, ఫిబ్రవరి 3 : కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులతో కుమ్ముకై డివిజన్ల టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బండి శ్రీలత చంద్రశేఖర్ విమర్శించారు. ఓ ప్రైవేటు హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.
సెట్టింగ్ కార్పొరేటర్గా ఉన్న తనకు కాదని మరొకరికి టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. వెలిచాల రాజేందర్రావు వ్యక్తిగత కక్షతోనే తనకు టికెట్ను అడ్డుకున్నారని ఆరోపించారు. గతంలో వెలిచాల రాజేందర్ రావు చేసిన వాఖ్యలను తాను విమర్శించడం వల్లే తనకు టికెట్ కేటాయించలేని పేర్కొన్నారు. అయినా తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తాను అని సవాల్ చేశారు.