Beeram Harshavardhan reddy | కొల్లాపూర్, ఫిబ్రవరి 23: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కొల్లాపూర్ పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు జరిగినా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని గుర్తు చేశారు.
హడావిడిగా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకుండా టార్గెట్తో ఒత్తిడి పెట్టి పని చేయించడంతోనే ప్రమాదం జరిగినట్లు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత వైఖరితో ఉద్యోగులు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టన్నెల్లో బోరింగ్ మిషన్ పాడైనట్లు తెలిసినా ఎందుకు పనులు చేయించినట్లు అని ఆయన ప్రశ్నించారు.
లూస్గా ఉండే పైకప్పు ప్రాంతాన్ని రాడార్ లాంటి పరిజ్ఞానం వాడి గుర్తించకుండా సిపేజీ క్లియర్ చేయకుండా కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేయించారన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.కోటి రూపాయలు పరిహారం ఇచ్చి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి పూర్తిగా కోరుకునే వారికి వైద్య సాయం అందించి రూ.50 లక్షల సహాయాన్ని అందించాలన్నారు. ప్రమాదంపై స్వతంత్ర కమిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Group-2 Mains | ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం
Gurukul Entrance Test | హాల్ టికెట్ ఉన్నా.. గురుకుల పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ
Woman Suicide | ఏడాది క్రితం ప్రేమ వివాహం.. రామంతపూర్లో గృహిణి ఆత్మహత్య