మహబూబాబాద్, ఏప్రిల్ 1(నమ స్తే తెలంగాణ): మండలంలో అతిపెద్ద గ్రామమైన కంబాపల్లి ఒకప్పుడు ఎక్క డ చూసినా అపరిశుభ్రంగా ఉండే ది. పల్లెప్రగతి పనులతో దాని కథ మారిం ది. ప్రతి వీధిలో సీసీ రోడ్డు వేశారు. ప్రధాన రహదారి పక్కనే రెండు ఎకరా ల స్థలం కేటాయించి, అందులో నర్స రీ, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. పార్కులో సుమారు మూడువేల మొక్కలు నాటి, వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఇక్కడి వచ్చి ఆహ్లాదకర మైన వాతావరణంలో వాకింగ్ చేస్తున్నారు. గ్రామం నుంచి కిలోమీటర్ దూరంలో పెద్ద చెరువు ఉంది. దీని సమీపంలో వైకుంఠధామం, కంపోస్ట్యార్డు నిర్మించారు. ఏ రోజు చెత్తను ఆ రోజు వేర్వేరుగా సేక రించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. మురు గు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. కంబాలపల్లి మీదుగా కొత్తగా జాతీ య రహదారి నిర్మించారు. దీంతో గ్రామానికి కొత్తకళ వచ్చింది. ఈ గ్రామం లో డివైడర్లు ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
పల్లె ప్రకృతి వనంలో జామ, నిమ్మ, దానిమ్మతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటారు. దీని పక్కనే నర్సరీ ఏర్పాటు చేశారు. ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఒకప్పుడు ఉన్న కంబాలపల్లి గ్రామానికి ఇప్పుడున్న గ్రామానికి పోల్చి చూస్తే ఎంతో అభివృద్ధి కనిపిస్తోంది.
ఇవి కూడా చుడండి
కరోనాపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన
మాస్క్ తప్పనిసరి.. లేదంటే రెండేండ్ల జైలు