మహబూబాబాద్ రూరల్/డోర్నక ల్, ట్పిల్ 24: ఇంటర్ పరీక్ష ఫలితా ల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన నేతి యాకయ్య-యాకమ్మల కూతురు అశ్విని(17) జిల్లా కేంద్రంలోని ప్రైవే ట్ కళాశాలలో సీఈసీలో ప్రథమ సంవత్సరం చదువుతున్నది.
సబ్జెక్ట్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. డోర్నకల్ మండలం చిల్కోడుకు చెందిన చిప్ప గణేశ్-స్వాతిల కూతు రు భార్గవి(17) వరంగల్ జిల్లా ఆరెపల్లి సమీపంలోని ఇంటర్మీడియట్ గురుకులంలో బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. బోటనీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది