మహబూబ్నగర్ : ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని తద్వారే కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా మహమ్మారి నివారణకు గానూ ప్రతిఒక్కరు మాస్కు ధరించి మాత్రమే బయటకు రావాలని సూచిస్తూ బ్యానర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్కు లేకుండా బయట తిరిగే వారిపై జరిమానాతో పాటుగా శిక్ష ఉంటుందని పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.
కరోనాతో జరిగిన నష్టం అందరికీ తెలిసిందేనని, ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా మెలగడం ద్వారా వైరస్ను నివారించవచ్చునని ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.