Chalo Hyderabad | కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 13 : సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల వాగ్దానంను తక్షణమే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బానోతు రాoసింగ్, కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయాలని కోరుతూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ మేరకు చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. రైతు బంధు, రైతుకు గిట్టుబాటు ధర, విద్యార్థి యువకులకు నిరుద్యోగ సమస్య, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, పింఛన్ పెరుగుదల అనేక విషయాలను బుట్టదాకలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం లోటు బడ్జెట్ను చూపిస్తూ కాలయాపన చేస్తుందని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు అధికారాలు చేపట్టి చేతులు మారుతున్నాయి తప్ప ప్రజల జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమాలు ఏ ఒక్క బూర్జవ పార్టీలు చేయటం లేదని ఘాటుగా విమర్శించారు.
75 సంవత్సరాల స్వాతంత్య్రంలో రోజురోజుకు దేశం, రాష్ట్రంలో ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు, అత్యాచారాల పరంపర కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి అలింగ శిష్యుల్లాగా పనిచేస్తున్నాయి తప్ప పేదల పక్షపాతిగా ప్రభుత్వాల తీరు ఉండకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రధానంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ గోదావరి పరివాహక ప్రాంతంలో 14 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములను కొట్టించి.. ఆదివాసి పేదలకు పంచిపెట్టిన చరిత్ర, ఇల్లందులో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర న్యూడెమోక్రసీ పార్టీకి ఉందన్నారు. ఈ విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను సత్వరమే అమలు చేయాలని చెప్పి.. ఫిబ్రవరి 16న హైదరాబాద్ బాగ్ లిoగంపల్లి ఓంకార్ బిల్డింగ్ లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు నక్క లావణ్య, పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జే గణేష్, నాయకులు శ్రీను నాగేశ్వరావు, రాములు, నవీన్, కోటయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం